Sunday, 7 January 2024

ఆలయ వ్యవస్థ పటిష్టత కోసం ఏర్పాటు చేయబడ్డ వివిధ మండలీలలో భాగంగా....GSS మాతృమండలి సభ్యుల సమావేశం.

శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

ఆలయ వ్యవస్థ పటిష్టత కోసం ఏర్పాటు చేయబడ్డ వివిధ మండలీలలో భాగంగా....

*GSS మాతృమండలి సభ్యుల సమావేశం*.

*ఆలయ వ్యవస్థ అవసరాలు మరియు సేవా కార్యక్రమాల దృష్ట్యా సేవాసమితి మాతృమండలి 3 విభాగాలుగా ఏర్పాటు*.

1. ఉత్సవ విభాగం 
2. మూల నక్షత్ర హోమం నిర్వహణ విభాగం
3. లలితా పారాయణం & అన్నపూజ నిర్వహణ విభాగం.

ఏర్పడిన 03 విభాగాల మాతృమండలి సభ్యులు సంవత్సర కాలం పాటు బాధ్యతలలో ఉంటారు.  ఎంపికైన సభ్యులకు ఆలయ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు మండలీల విధులు, నిర్వహణ బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ సలహాలు_సూచనలు తెలిపారు.

*ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాల  గురించి మండలి ఇంచార్జి మరియు సహాయక్ ద్వారా మండలిలో ఉన్న సభ్యులందరికీ పూర్తి అవగాహన కల్పించడం*.

*వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది,  వ్యవస్థని వ్యక్తులే పటిష్టం చేయాలని.. వ్యవస్థ కోసం పని చేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రాధాన్యతపై ఎక్కువ శ్రద్ద చూపరాదు*..

*వ్యవస్థ కోసం సమయం ఇచ్చేవారిని మరియు సంపద ఇచ్చేవారిని గుర్తించి, తగు రీతిలో వారికి  గౌరవం ఇవ్వాలని తెలిపారు*.

*ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వారందరూ అన్ని తారతమ్యాలు  @కుల, ధన, అధికార ప్రస్తావన  లేకుండా సహృదయ సేవా భావనతో, నిస్వార్థంగా ఉత్సవాల వ్యవస్థలో భాగస్వామ్యం కావాలన్నారు*.

*రాబోయే రోజుల్లో కనీసంగా 108 మంది సభ్యులతో మాతృమండలిని ఏర్పాటు చేసుకుని  అతి పెద్ద మాతృమండలిగా అన్ని రకాల సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలన్నారు*.

*వ్యవస్థలో కొత్తతరం యువతని భాగస్వామ్యం చేసి రాబోయే తరాలకు సేవా భావం పెంపొందించాలన్నారు*

ఆలయ ఉత్సవాలలో మండలి వారిగా పాల్గొనటకు పూర్వ తయారీ కోసం సమావేశాలు నిర్వహించుకుని, బాధ్యతల విభజన చేసుకోవాలి.

ఈ సమావేశంలో విభాగాల వారిగా పాల్గొన్న మాతృమoడలి సభ్యులు.

1. మూల నక్షత్ర నిర్వహణ విభాగం :: 14
2. లలితా పారాయణం & అన్నపూజ నిర్వహణ విభాగం :: 08
3. ఉత్సవాల నిర్వహణ :: 10


No comments:

Post a Comment