బోలో సరస్వతీ మాతాకి జై..
గుణ సంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అనే ఆశయ స్ఫూర్తితో...
జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి ద్వారా అన్ని విద్యా స్థాయిల విద్యాసంస్థలకు జ్ఞానప్రదాత, చదువుల తల్లి శ్రీ సరస్వతిమాత విగ్రహాలను అందివ్వాలనే సంకల్పo జరిగింది.
2018 సంవత్సరం నుండి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 200 విద్యా సంస్థలకు అమ్మవారి విగ్రహాలు అందించబడ్డాయి.
అందులో భాగంగా కర్మన్ ఘాట్ లోని ZPH స్కూల్ లో అమ్మవారి ఏర్పాటు కోసం విగ్రహం తీసుకెళ్తున్న పాఠశాల బృందం.
సుమారు 700 పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో అమ్మవారి అనుగ్రహంతో నిత్య చైతన్యం జరగాలని ఆశిస్తూ..
విగ్రహ ఏర్పాటుకు సమన్వయ కర్తగా ఉన్న శ్రీ సుధీర్ బాబు గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీ పద్మావతి గారికి, ఉపాధ్యాయులకు మరియు
కర్మన్ ఘాట్ వాసులకు
శుభాకాంక్షలు💐.. శుభాభినందలు.
:~ సదా వెంకట్,
No comments:
Post a Comment